పూర్వం
ఒక బ్రాహానోత్తముడు తన వ్రుత్తి వదిలి ఒక బోయ స్త్రీని వివాహం చేసుకొని
విచ్చలవిడిగా ప్రవర్తించాడు! కానీ ఇంకా సంపద మీద కోరిక తీరక దొంగతనాలు కూడా
మొదలు పెట్టాడు! అయినా ఇంకా ఏదో సంపాదించాలి అనే ఆశతో కొందరు వ్యాపారాలు
తమ వ్యాపారం కోసం దేశాలు తిరుగుతుంటే ఈ బ్రాహ్మణుడు కూడా వాళ్ళతోపాటు
బయలుదేరాడు!అలా కొంత దూరం వెళ్ళిన తరువాతఒక మదించిన ఏనుగు వీళ్ళ మీదకి
ఉరికి కొందరిని తొక్కేసింది! అది చూసి
ఎవరికి తోచిన దారిలో వారు పారిపోయారు! ఈ బ్రాహ్మణుడు కూడా అలా కొంత దూరం
పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి అటు ఇటు చూస్తుంటే పెద్ద వృక్షం ఒకటి
కనిపించింది! వెళ్లి దానికింద విశ్రాంతి తీసుకున్నాడు! ఆ చెట్టు మీద
నాడిజంగుడు అనే కొంగ నివాసం ఉంటుంది! ఆ కొంగ ఇతనిని చూసి మిత్రమా ఎవరు
నువ్వు? ఎక్కడికి నీ ప్రయాణం? ఎందుకోసం? దానికి సమాధానంగా తన సంగతి అంతా
వివరించి చెప్పాడు! నేను ఒక బ్రాహ్మణుడిని, నాకులవృత్తి వదిలి సంపద మీద
వ్యామోహంతో చేయరాని పనులన్నీ చేశాను! వ్యాపారం చేయాలని ఆశతో వ్యాపారులతో
కలిసి వెళ్తుండగా ఏనుగు కొందరిని తొక్కేసి చంపేసింది! నేను భయపడి ఇలా
పారిపోయి వచ్చాను! అని తన ఆవేదనని విన్నవించుకొన్నాడు! అది విన్న
నాడిజంగుడు మిత్రమా బంగారం, వెండి, స్నేహితుడు, ధర్మం ఈనాలుగు మానవుడి
అభివృద్దికి తోడ్పతాయని ధర్మ శాస్త్రం, ధర్మవేత్తలు ఏకగ్రీవంగా
ఒక్కానిస్తున్నారు! ఈ నాలుగింటిలో స్నేహితుడు అత్యుత్తమమైన వాడని ప్రతీతి!
నువ్వు నా గృహానికి వచ్చావు కాబట్టి నాతో ఏడు మాటలు మాట్లాడవు కనుక నువ్వు
నామిత్రుడివి సందేహంలేదు! కాబట్టి నేను ఇచ్చిన ఆతిద్యం స్వీకరించి ఈ
రాత్రికి విశ్రాంతి తీసుకో! ఉదయం కర్తవ్యం ఆలోచిద్దాం! అని తనగూటికి తను
వెళ్ళిపోయింది! బ్రాహ్మణుడు ఆతిద్యమిచ్చిన తీయతీయని ఫలములు, కందమూలాలు, తేట
నీరు, స్వీకరించి నిద్రపోయాడు! ఇంకా ఉంది
No comments:
Post a Comment